mahimasabdam.tv@gmail.com
+91 9390209376
.jpeg)
సీమోను పేతురు దోనె ఎక్కివలను దరికి లాగెను ; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను ( యోహాను 21:11 ) . యేసు ప్రభువు పునరుత్థానుడు అయిన తరువాత తిబెరియ సముద్ర తీరమున మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన శిష్యులు 153 చేపలను పట్టుకొన్నారు . కొందరు బైబిల్ పండితులు 153 అను సంఖ్యలో ఏమైనా విశిష్టత ఉన్నదా అని పరిశీలించిరి . 5 వ శతాబ్దమునకు చెందిన జెరోమ్ ( D Jerome ) అను భక్తుడు సముద్రములో 153 రకములైన చేపలు ఉన్నవనియు , అలంకారముగా అన్ని జాతుల ప్రజలను ప్రభువు దగ్గరకు నడిపించాలని దేవుని ఉద్దేశము అని ఆయన అభిప్రాయము . మరొక భక్తుడు ప్రపంచములో 153 ప్రధానమైన భాషలు కలవని 153 చేపలు అనగా 153 భాషల వారికి సువార్తను అందజేయవలెనని దాని భావమని చెప్పారు . 5 వ శతాబ్దమునకు చెందిన అగస్టీన్ మనకు 10 ఆజ్ఞలు మరియు 7 దేవుని సంఖ్య ఈ రెండింటిని కలిపిన యెడల 17 వచ్చును . 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 చేపలను ఒక వరుసలోను దాని క్రింద 16 చేపలను దాని క్రింద 15 చేపలను ఆ విధముగా ఒకటి వరకు పటములో పేర్చిన విధముగా పేర్చినచో ఒక త్రిభుజము వచ్చును . ఆ త్రిభుజము త్రిత్వమును చూపించు చున్నది . చివరిగా 153 చేపలు ఉన్నవని యోహాను భక్తుడు ఎందుకు వ్రాసారు ? అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఆ వలలో 153 చేపలు ఉన్నవి కనుక అని సమాధానము ఇస్తాను . - డా || పి.బి.మనోహర్ , 98483 63638
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.






















































.jpeg)






.jpg)
 dad.png)














.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech