mahimasabdam.tv@gmail.com
+91 9390209376
పెంతుకొస్తు సంఘము మలబారుకు చెందిన రెవ.పి.ఎమ్.శామ్యూల్గారు అనేక ప్రాంతములలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సంచరించి, ప్రభుని సందేశాన్ని ధైర్యంగా ప్రకటించి 1932లో ఆంధ్ర ప్రాంతములో ఈ సంఘానికి పునాది వేసిరి. వీరు భారతదేశపు మలబారు ప్రాంతమునకు సంబంధించిన అతి పురాతన సిరియా సంఘమునకు చెందినవారు. వీరు కేరళలో 1903 జులై 1వ తేదీన జన్మించిరి. 1932లో పెంతుకొస్తు సంఘము నేర్పరచనుద్దేశమును వ్యక్తపరచిరి. ఒక మిత్రుని సహకారంతో శ్రీలంకలో జరిగిన లూనాన్లో పెంతుకొస్తు సభలో పాల్గొనిరి. దేవుని దర్శనం ప్రకారం తెలుగు ప్రాంతానికి వచ్చి సేవ జరిగించిరి. ఈయన ఆంధ్రలో అనేక ప్రదేశాలలో సువార్త ప్రకటించి వందల సంఖ్యలో సంఘాలు స్థాపించారు. 1947లో స్వీడన్ రాజధాని నిస్టాన్ హమ్ నగరంలో ప్రసంగించిరి. తరువాత బర్మా, సింగపూర్, నార్వే, డెన్మార్క్, జపాన్, హలెండ్, ఆఫ్రికా, ఫ్రాన్స్ మొదలగు దేశాలలో సువార్త ప్రకటించిరి. ఆంధ్రప్రదేశ్ ఇండియా పెంతుకొస్తు సంస్థ అధ్యకక్షులుగా వీరు నిర్విరామకృషి చేసిరి. ఎన్నో ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి అనేకవేల ఆత్మలను రక్షించారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech