mahimasabdam.tv@gmail.com
+91 9390209376
మహిమ శబ్ద
七√

ఒక పట్టణంలోని చిన్న సంఘానికి కొత్తగా పాస్టర్గా దానియేలు నియమించబడ్డాడు.
ఆయన బైబిలు బోధలోనే కాదు, సేవలో కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకున్నాడు.
కొంతకాలానికి సంఘంలో కొత్త నాయకులను నియమించే రోజు వచ్చింది.
అందరూ పాస్టర్ గారు వారికి గొప్ప ప్రసంగం చేస్తారని ఎదురుచూశారు.
కానీ దానియేలు పాస్టర్ నిశ్శబ్దంగా ఒక తువాలు, ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వేదిక ముందు ఉంచాడు.
తర్వాత కొత్త నాయకులందరినీ ముందుకు రమ్మని ఆహ్వానించాడు.
సంఘ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా, పాస్టర్ ఒక్కొక్కరి పాదాలను ప్రేమతో కడిగి తువాలతో తుడిచాడు.
అనంతరం ఆయన ఆ నాయకులను కూడా ఒకరి పాదాలను మరొకరు కడగమని కోరాడు.

19వ శతాబ్దము ఆరంభములో జపాన్ దేశము కొరియాను ఆక్రమించుకొన్నది. అప్పటివరకు అనేక మంది కొరియాను ఆక్రమించుకొన్నను జపాన్ వారు బహుక్రూరముగా ప్రవర్తించిరి. స్త్రీల యెడలను, పిల్లల యెడలను బహుపైశాచికముగా ప్రవర్తించిరి. వారిలో ఎక్కువగా కష్టపడినది నష్టపోయినది క్రైస్తవులే. కొరియాను ఆక్రమించుకొన్న వెంటనే విదేశ మిషనెరీలందరూ కొరియాను విడిచి వెళ్ళవలెనని జపాన్ వారు ఆజ్ఞాపించిరి. జయించిన వారు చర్చిలను మూత వేసినచో క్రైస్తవ్యము అంతరించునని భావించిరి. రోమన్ ప్రభుత్వము వారు మొదటిగా ఆ పనిని చేసిరి. కాని ఎవరును క్రైస్తవ్యమును అంతమొందించలేక పోయిరి.
జపాన్ వాళ్ళు కొరియాలోనున్న సంఘ నాయకులను ఖైదు చేసిరి. సంఘస్తులను ఆరాధన చేసికొనుటకు కూడుకొనకూడదని ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞలు ధిక్కరించిన వారిపై ఎంతో పాశవికముగా దాడిచేసిరి. బాధించబడినవారి హృదయములో జపాన్ వారి యెడల ఏహ్యత కలిగెను. ఒక పాస్టర్ గారు జపాన్ పోలీసు అధికారి వద్దకు పదే పదే వెళ్ళి తాము సంఘముగా కూడుకొని ప్రభువును ఆరాధించుకొనుటకు అనుమతి ఇవ్వవలసినదని కోరెను. అతడు పదే పదే గోజాడుటవలన అతని మనవి అంగీకరించబడెను. ఆదివారమునాడు అనేక కొరియా కుటుంబముల వారు ఆరాధించుటకు వెళ్ళుచుండగా జపాన్ అధికారులు వారిని హేళనగా చూచుచుండిరి.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
మహిమ శబ్ద౦
Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376