mahimasabdam.tv@gmail.com
+91 9390209376

యెరూషలేము నుండి కల్వరి కొండకు సాగిన సిలువయాత్రలో అనేకమంది ఆయనను వెంబడించిరి. ఆ జన సమూహంలో అనేక గుంపుల ప్రజలు వుండవచ్చును కాని ప్రాముఖ్యంగా మూడు గుంపులను లూకా 23:26-28 నుండి ధ్యానిద్దాం.
| అపహసించి, సిలువవేసిన గుంపు : సిలువ యాత్రలో గెత్సెమనె తోట నుండి వేదన ప్రారంభమయినది మొదలు తుది శ్వాస విడిచే వరకు పలునిందలు, శ్రమలు చెప్పశక్యము కాని బాధను అనుభవించెను. ఈ యాత్రలో మొదటి గుంపు అపహసించి, బాధించిన గుంపు. ఆయనను అనేక రీతులుగా బాధించిరి. 1. ముఖము మీద ఉమ్మిరి, 2. ముఖముపై గుద్దిరి, 3. అరచేతులతో కొట్టిరి, 4. కొరడా దెబ్బలు 39 సార్లు కొట్టిరి, 5. ముళ్ళ కిరీటం, 6. రెల్లుతో తల మీద కొట్టిరి, 7. కాలు మీద కాలుపెట్టి కరుకైన మేకు, 8. చేతులలో మేకులు, 9. అనేక నేరములు మోపిరి, 10. దూషించిరి, 11. అపహసించిరి, 12. ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచి, 13. బరువైన శరీరంతో ఆరు గంటలు సిలువపై భారముగా వ్రేలాడెను. ఈ మొదటి గుంపు అనేక శ్రమలు బాధలు పెట్టి ఆయనను హింసించిరి. ఈ మొదటి గుంపులో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లూకా 23:27లో 'గొప్ప జనసమూహం'లో ఎవరెవరున్నారు?
ఎ. రాణువవారు : వీరు రోమా సైనికులు, బంట్రోతులు. వీరి పని నేరస్థులను కఠినంగా శిక్షించి ఘోరంగా చంపడము. చాలా బలమైనవారు బలిష్టమైన కండరములు కలిగి ఒక్క గుద్దుతో మనిషిని బలహీనపరచేటట్లు శక్తికలిగి వుంటారు. వీరు యేసయ్య వీపుపై ఒక్కొక్క కొరడాదెబ్బ కొడుతూవుంటే, గుద్దుతూ వుంటే చెప్పలేని బాధ. ఈ సైనికులకు ఎటువంటి జాలి, కరుణ వుండదు.
బి. మత గురువులు : నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనే గొప్ప ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును పాటించి, బోధించే పెద్దలు, నాయకులు, ప్రజల పాపక్షమాపణ కొరకు పరిశుద్ధ స్థలములో అర్పణలు అర్పించే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఇంకా అనేక మంది యూదా మతనాయకులు యేసయ్యను పిలాతు నొద్దకు, అక్కడ నుండి హేరోదు నొద్దకు, మరలా పిలాతు నొద్దకు త్రిప్పుచూ అపహసిస్తూ సిలువకు అప్పగించారు.
సి. యూదులు : యాకోబు సంతానాన్ని దేవుడు ఇశ్రాయేలీయులుగా ఆశీర్వదించాడు. ఆ 12 గోత్రముల వారందరూ అందులో ముఖ్యమైన యేసయ్య వచ్చిన గోత్రమైన యూదా జాతివారు కూడా ప్రభువును సిలువకు అప్పగించి, బాధించి, శ్రమపెట్టిన వారిలో వున్నారు. దేవుని పిల్లలుగా పిలువబడిన ఈ జాతి వారంతా దేవుని కుమారునే సిలువకు అప్పగించిరి. వీరునూ చేయని నేరములు ఆయనపై మోపి దూషించి, పరిహాసమాడిరి.
డి.అన్యజనులు : ఈ గుంపులో అన్యజనులు కూడా కలరు. వారునూ దూషించిరి.
ఇ. రోమా ప్రభుత్వ నాయకులు : గవర్నరైన పిలాతు అంటే అందరికీ భయము. పిలాతు గలతీయుల రక్తము బలులలో కలపిన క్రూరుడు. అంతటి అగత్యము చేసినపుడే ఎదిరించడానికి ఎవరికినీ ధైర్యం చాలలేదు. ఏ ప్రతిపక్షం ఎదురవ్వలేదు. అటువంటి వ్యక్తికి సిలువను ఆపే హక్కు అధికారము వుంది, కాని అతడునూ ప్రజల కోరిక మేరకు సిలువకు అప్పగించెను. ఇంకా హేరోదు అపహసించెను. (లూకా 23:11) ఇంకా ప్రభుత్వమంతా ఏకమై సిలువకు మార్గం చూపెను.
ఎఫ్. మార్గమున పోయేవారు : యేసయ్య శరీరమంతా గాయములతో ఉడికించిన మాంసము వలే తయారైంది. ఆయన భుజములు గొప్ప అలసట చెంది, కండరములు గొప్ప అలల వలే తిమ్మిరితో బాధ పెడుతూ, వీపు అంతా నాగలి సాలు వలే దున్నబడి మాంసముతో పాటు నరములు చేరి రక్తము ప్రవహిస్తూ వుంటే, రొమ్ము దగ్గర నలగగొట్టబడిన బాధ, వెంట్రుకలు పెరికిన బాధ ఇటువంటి భయంకరమైన బాధతో వుంటే దారినపోయేవారు తల ఊపుచూ నీవు దేవుని కుమారుడవైతే సిలువమీద నుండి దిగిరమ్మని అపహసించిరి.
జి. ఇద్దరు దొంగలు : సిలువమీద నున్న ఇద్దరు దొంగలు ఆయనను నిందించిరి. (మత్త 27:44) కొంతసేపు అయిన తర్వాత ఒకడు మరొకనితో మనకైతే ఇది న్యాయమే. ఈయనకు ఇది తగినదికాదు, ఈయన యందు ఏ దోషము లేదు అని ఒప్పుకొనెను. యేసూ! నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకొనుమని ప్రార్ధించగానే యేసయ్య - నేడు నీవు పరదైసులో నాతో కూడా ఉందువని చెప్పెను. రెండవవాడు మారుమనస్సు పొంది దేవుని రక్షణ పొందుకొనెను.
హెచ్. యేసయ్య శిష్యులు : 1.పేతురు. పేతురు ఎక్కువగా యేసయ్యతో గడిపినవాడు అనేకసార్లు ప్రార్ధించుటకు యేసయ్య పేతురును వెంటబెట్టుకొని పోయెను. చివరి గడియలలో కూడా ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా (లూకా 22:23) 3 సార్లు నీవు బొంకుదువని యేసయ్య చెప్పెను. ఈ విధంగా ఆయన అద్భుతాలు చూచి ఆయనతో సహవాసం చేసిన గొప్ప శిష్యుడు. పేతురు అపహాసకులు గుంపులో నున్నాడు. మార్కు 14:54లో 'పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చొండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను'. యేసయ్య శ్రమ పడుచూ వుంటే ఆయన వెంట ఉండవలసిన పేతురు గుంపులో వున్నాడు. ప్రియ సోదరుడా! సోదరీ! నీవు ఏ గుంపులో నున్నావు! అపహసించి, సిలువ వేసేవారితో నున్నావా?
2. ఇస్కరియోతు యూదా : యేసయ్యతో పాటు సహవాసం చేసి, 12 మంది శిష్యులతో ఒక శిష్యునిగా వుండిన యూదా 30 నాణెములకు యేసయ్యను అప్పగించి సిలువ వేసే గుంపులోనున్నాడు.
'.....ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్దనుండియు, శాస్త్రుల యొద్దనుండియు, పెద్దల యొద్ద నుండియు వచ్చిరి. (మార్కు 14:43) కత్తులతో తిరిగే వారి గుంపుతో అప్పగించే గుంపుతో సిలువకు ప్రధాన సూత్రధారివనే యూదా గుంపుతో వచ్చెను. యేసయ్యతో తింటూ, ఉంటూ, అమ్మినరీతిగా నీవునూ యేసయ్యతో వుంటూ ఆయనను అమ్ముచున్నావా?
శిష్యులిద్దరూ మొదటి గుంపులో వున్నారు, కాని ఆ తరువాత పేతురు పశ్చాత్తాపముతో జరిగినది గుర్తెరిగి ఏడ్చుచూ ప్రభువు యొద్దకు తిరిగెను. నీవును మొదటి గుంపులో వుంటే పేతురు వలే పశ్చాత్తాపముతో తిరిగి యేసయ్య గుంపునకు రా.
|| కన్నీరు కార్చి విలపించే గుంపు : లూకా 23:7లో ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచూ దుఃఖి
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




























































Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech