Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన రాజమండ్రి అర్బన్‌ & రూరల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌

తాజా/16 September 20222022 సెప్టెంబర్‌ 13వ తేది మంగళవారం ఉ॥ 10 గం॥లకు స్థానిక సి.ఎస్‌.ఎన్‌.చర్చిలో 400 మంది సేవకులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఫౌండర్‌ & ప్రెసిడెంట్‌ బిషప్‌ డా॥ ప్రతాప్‌ సిన్హా ఆధ్వర్యంలో రాజమండ్రి అర్బన్‌ & రూరల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఘనముగా జరిగింది. తూ॥గో॥జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అడిషనల్‌ సెక్రటరీ రెవ.ఎమ్‌.విజయసారధి అతిధులను వేదికపైకి ఆహ్వానించగా తూ॥గో॥జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌, రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జనరల్‌ సెక్రెటరీ రెవ.డా॥వి.ఎస్‌.సి.ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశమునకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లవరపు జాన్‌వెస్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జగన్‌ మోహాన్‌ రెడ్డి సేవకులను గుర్తించి వారికి నెలకు 5000 రూపాయలు నేరుగా వారి అకౌంట్‌కు వచ్చేలా చేయుటలో కృతార్ధులయ్యారని కొనియాడారు. ఈ సభలో బిషప్‌ డా॥కె.ప్రతాప్‌ సిన్హా గారు మాట్లాడుతూ పాస్టర్స్‌ని మొదటిసారిగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్‌.జగన్‌మోహాన్‌ రెడ్డి గారు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాస్టర్స్‌ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర నాయకులు రెవ.డా॥కె.సుధీర్‌ కుమార్‌ గారు వాక్య సందేశమును అందించారు. తూ॥గో॥జిల్లా జనరల్‌ సెక్రటరీ రెవ.డా॥జుహాని హాలోనిన్‌, మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ గారికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు సమాధుల స్థలం ఇవ్వాలని, క్రైస్తవుల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ గోదావరి నది వద్ద బాప్తిస్మముల రేవు ఇవ్వాలని క్రిస్టియన్‌ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ జాన్‌ వెస్లీ ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించారు. తూ॥గో॥జిల్లా ట్రెజరర్‌ రెవ.పి.టాటావిక్టర్‌ గారు, రెవ.సుకుమార్‌ గారు ఆధ్వర్యంలో జిల్లా నాయకులను, సేవకులను సన్మానించారు. రెవ.డా॥కె.మోజస్‌ బాబు ముగింపు ప్రార్థన చేయగా, రెవ.డా॥జి.జాన్‌ ప్రసాద్‌ వందన సమర్పణతో కార్యక్రమము ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీ ఇమ్రాన్‌, ఆఫీస్‌ సూపరిండెంట్‌, అర్బన్‌ రూరల్‌ రీజినల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ నాయకులు మరియు జిల్లా నాయకులు రెవ.డా॥కరుణాకర్‌, రెవ.డా॥పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

371-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

సామెతలు 21:21 ఎవరైతే ధర్మాన్ని, ప్రేమను అనుసరిస్తారో వారు జీవితం, శ్రేయస్సు మరియు గౌరవాన్ని పొందుతారు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech