తాజా వార్త
ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా రక్తదాన శిబిరము
తూర్పు గోదావరి జిల్లా/08 July 2026 పెద్దాపురం :- ఈరోజు జూలై మూడు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పెద్దాపురం రోటరీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో పెద్దాపురం క్లాప్స్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరమును క్లాప్ సెక్రెటరీ రెవ.నాగ శ్రీనివాస్ గారు జిమ్స్ గారు నడిపించగా, క్లాప్స్ వైస్ ప్రెసిడెంట్ రెవ. ఎల్. జ్ఞానానందం ప్రారంభ ప్రార్థన చేయగా, జాయింట్ సెక్రెటరీ రెవ. డి. ఎస్. పి.రావు బైబిల్ చదవగా, కాకినాడ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ టీ బ్లెస్సింగ్ గారు రక్తదాన శిబిరమును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, అనంతరం క్లాప్స్ కన్వీనర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిషప్.డాక్టర్ సి.బి.ఐ. సుకుమార్, పెద్దాపురం రీజినల్ సెక్రెటరీ బ్రదర్ డి.వెంకట్ పాలు, ముగింపు ప్రార్థనలు చేయగా, క్లాప్స్ వ్యవస్థాపకులు, పెద్దాపురం రీజినల్ చైర్మన్ రెవ.డాక్టర్ పురుషోత్తం దాస్ లంక ఆశీర్వాదములు ఇచ్చిరి.
ఈ కార్యక్రమంలో క్లాప్స్ వారు,కొంతమంది, యవనస్తులు రక్త దానం చేసిరి, ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బిషప్ ఎం. రవీంద్ర బాబు, బిషప్.పి ప్రసాద్ బాబు, మరియు క్లాప్స్ కోశాధికారి ఎన్.పాస్టర్ సుకుమార్ సహాయం రీజనల్ మెంబర్ రెవ. జి. చందుస్టీఫెన్,
బ్రదర్.కె.విజయ్ కుమార్,రెవ. టి. నవీన్ రాజు,రెవ. జి ఆనంద్ రాజు, బిషప్. వై ఆర్ మన్నా,రెవ.టి. కృపావరం, బ్రదర్. జి. ప్రకాష్ రావు, బ్రదర్ యు. ఆనంద్,మరియు రోటరీ బ్యాట్ సెంటర్ ప్రెసిడెంట్ చలపతిరావు, సెక్రెటరీ ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ చౌదరి మరియు డాక్టర్లు కమిటీ వారు పాల్గొనిరి.